ADB: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జైనథ్ బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. బస్టాండ్ ఆవరణలో గంటపాటు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.