BDK: భద్రాచలం గిరిజన మ్యూజియం ఆధునికీకరణకు రూ.కోటి నిధులు విడుదలయ్యాయని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ గురువారం తెలిపారు. అలాగే ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ‘ఆదివాసీ కోయ ఇలవేల్పుల చరిత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వారు వెల్లడించారు. మరో 2 నెలల్లో మ్యూజియం డిజైనింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు.