MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలోని ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు విధులను బహిష్కరించారు. జేఏసీ పిలుపు మేరకు విధులను బహిష్కరించిన ఆర్టిజన్ కార్మికులు తూప్రాన్ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం డిమాండ్లపై దిగి రాకుంటే సమ్మెను ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ స్వామి, కన్వీనర్ ఎస్కే షాదుల్ హుస్సేన్ పాల్గొన్నారు.