అన్నమయ్య: రాజంపేటలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తామని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రకటించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ నెల 16న పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోగుల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు.