PPM: సురక్షితమైన ప్రసవం, తల్లీ బిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా గర్భిణిలకు వైద్య సేవలు అందించాలని జిల్లా ఆర్.బి ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీఎంఎస్ఎమ్ఏ కార్యక్రమాన్ని గురువారం తనిఖీ చేశారు. అనంతరం గర్భిణీల ఆరోగ్య పరీక్షల వివరాలు పరిశీలించారు.