ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి తన కూతురు మృతదేహంతో ఐదు నెలల పాటు ఒకే ఇంట్లో ఉన్న ఘటన సంచలనం సృష్టించింది. ఆమె నిద్రిస్తుందని స్థానికులను నమ్మిస్తూ, శవం వాసన రాకుండా పర్ఫ్యూమ్స్ చల్లేవాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి చూడగా బెడ్పై అస్థిపంజరం బయటపడింది. డిసెంబర్ 5న కామెర్లతో ఆమె చనిపోయింది.