ASR: డుంబ్రిగూడ మండలం జాముగూడ–కోర్రాయి గ్రామాల మధ్య రహదారి, బ్రిడ్జి నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోవడంతో సుమారు 30 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి అన్నారు. తక్షణమే రహదారి, బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని గురువారం నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవలు కూడా అందని పరిస్థితి ఏర్పడిందన్నారు.