KDP: శ్రీ సత్య సాయి జిల్లా కోడికొండ చెకోపోస్ట్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే VN పల్లె మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుతో మండలంలో భూముల ధరలు పెరుగుతాయని రైతులు, రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ హైవే నిర్మాణం మళ్లీ జీవం పోస్తుందని స్థానికులు భావిస్తున్నారు.