VZM: ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన తగాదాలను శాశ్వత లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కోర్టులో శాశ్వత లోక్ అదాలత్పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకింగ్, బీమా, విద్యాసంస్థలు, ఆస్తి, ఉపాధి హామీ పథకం, రవాణా, పోస్టల్, విద్యుత్, నీటి సరఫరా తదితర వాటిని రాజీ చేసుకోవాలన్నారు.