PPM: పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవర్ పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ అగ్నిమాపక అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 231 మంది అమరవీరులకు నివాళులర్పించారు.