కోనసీమ: గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వెలుగు సంఘాల సహాయకులు, వీఓఏలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న 51 మంది వీఓఏలకు ఎమ్మెల్యే, ఆకుల రామకృష్ణ చేతుల మీదుగా స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు.