AKP: జనగణన-2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల పౌరులు se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చునన్నారు.