కర్నూలు జిల్లాలో బీసీవై పార్టీ చేపట్టిన బీసీల 5 డిమాండ్లకు బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం మద్దతు తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, కులగణన, 44% రిజర్వేషన్లు వంటి డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 11న ఆమరణ దీక్షను విజయవంతం చేయాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.