NGKL: వనపర్తిలో జరిగిన కవి సమ్మేళనంలో బిజినపల్లి మండలానికి చెందిన ప్రముఖ కవి డాక్టర్ ప్రతాప్ కౌటిల్యను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు ప్రశంసా పత్రం, మెమెంటో అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు కవులు ఈ సమ్మేళనంలో పాల్గొని అలరించారు.