SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ పోలకమ్మకుంట చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై తహసీల్దార్ అమీన్ సింగ్ బుధవారం విచారణ చేపట్టారు. HIT TV APP కథనానికి స్పందించి మట్టి కుప్పలను సీజ్ చేయడంతో పాటు, జేసీబీలను బైండోవర్ చేశారు. చెరువుల్లో అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఆయన హెచ్చరించారు.