మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లక్షెట్టిపేట పట్టణంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ, మండల అధ్యక్షులు ఎండీ. ఆరిఫ్, పింగళి రమేష్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తారన్నారు. ఆ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలన్నారు.