BHPL: గణపురం(M)లోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ అమలు, సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి ప్రహరీ, సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతుల ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.