MDK: పాపన్నపేట మంజీరా నదీ తీరంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఎనికపల్లి, చిత్రలా, గాజులగూడెం పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడగానే ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ కరువైందని మండిపడుతున్నారు.