NGKL: కుమ్మెర గ్రామంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులతో కలిసి కుమ్మెర గ్రామంలో ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా దాడి చేసి గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.