KNR: కొత్తపల్లి మండలం రేకుర్తిలో విస్తుపోయే దొంగతనం వెలుగుచూసింది. అమ్మవారికి మట్టెలు చేయిస్తామని, ఆర్థిక సాయం కావాలంటూ ఇద్దరు మహిళలు రాగా.. అనూష అనే యువతి కొంత నగదు సహాయం చేశారు. అయితే అనుషను మాటల్లో దించి, ఆమె నుదుట మత్తుమందు కలిపిన బొట్టు పెట్టారు. ఈ క్రమంలో అనూష స్పృహ కోల్పోగా, అనంతరం ఇంట్లోని నగదు, నగలతో పరారయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.