KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. మహబూబ్ అలీ అనే వ్యక్తికి చెందిన పట్టా భూమిలో శనివారం అర్ధరాత్రి కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కోయ, ముస్లిం పూజారులతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు సమాచారం.