ASF: రెబ్బెన మండలం గంగాపూర్ పరిసరాల్లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ముఠాపై మెరుపు దాడి చేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2,540 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.