SRD: ముత్తంగి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం శారద మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా బోధన నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని ఆమె సూచించారు.