SRCL: వేములవాడ శాత్రాజుపల్లికి చెందిన సెక్యూరిటీ గార్డ్ ప్రశాంత్ గుండెపోటుతో మృతి చెందారు. తిప్పాపూర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆయన, రాత్రి అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. యువకుడైన ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.