SRPT: చివ్వేంల మండల పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామంలో గల పల్లె దవాఖాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం ఉదయం 9:18 గంటలైనా దవాఖానకు తాళం వేసి ఉండటంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.