MBNR: బాలానగర్ (M) పెద్దాయపల్లి సర్వే నం.78లో ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్ ఆక్రమించిందని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్ 7న ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.