W.G: పైలేరియా నివారణకు దోమల నియంత్రణే ఏకైక మార్గమని DMHO గీతాబాయి స్పష్టం చేశారు. శుక్రవారం వీరవాసరం మండలం అండలూరులో నిర్వహించిన పైలేరియా నివారణోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రోగులకు అవసరమైన MMDT కిట్లను ఆమె పంపిణీ చేశారు.