KMM: ఖమ్మం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై కీలక సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.