NLG: మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 5 మండలాలకు చెందిన 98 మంది రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, కల్టివేటర్లు వంటి పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.