KMM: కల్లూరు మున్సిపాలిటీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అధికారులను సూచించారు. శనివారం కల్లూరులో పర్యటించిన ఛైర్మన్ డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.