MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేసిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం లక్షెట్టిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ నోట్లు చలామణి చేసిన 14 మందిని గుర్తించామని, అందులో 12 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వారి నుండి రూ.5,98,500 ఫేక్ కరెన్సీ, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.