MLG: మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీక్ అవుతున్న విషయం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా భారీగా నీరు బయటకు వస్తున్నా, సంబంధిత అధికారులు మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.