KMM: కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అంబేద్కర్ భవన్లో పునరావాసం ఉంటున్న భూదాన్ బాధితులను ఆయన పరామర్శించి మాట్లాడారు. పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని తెలిపారు.