GDWL: సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, విద్యార్హతలున్నా పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల పట్ల వివక్ష చూపడం దారుణమని సీపీఎం గద్వాల్ జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మండిపడ్డారు. గద్వాల జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా వీరి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.