SRPT: నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ భవాని, అధికారులు పాల్గొన్నారు.