ASF: కాగజ్నగర్ పట్టణంలో లారీ, ట్రక్ డ్రైవర్లకు శుక్రవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు CI ప్రేమ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని SPM హెచ్ఆర్డీ భవనంలో ఉదయం 10 గంటలకు లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందన్నారు. ముఖ్య అతిథిగా SP నితిక పంత్ హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు.