MBNR: గత ఏడు దశాబ్దాలుగా భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తూ మౌలిక అంశాలను స్పష్టం చేస్తున్నదని సామాజిక విశ్లేషకుడు, పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డా. నాగం కుమారస్వామి తెలిపారు. రాజ్యాంగం పాలకులకోసం మాత్రమే కాదు, పీడిత ప్రజల విముక్తికి రూపొందించబడిన పవిత్ర గ్రంథమని, దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని పేర్కొన్నారు.