KMR: జుక్కల్ మండలం మందాబాద్ తండకు చెందిన దేవల్ల హనుమంతు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమంతు శనివారం బీరు తాగుతూ ఫోటోను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై సోమేశ్వర్ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు ఆదివారం కేసు నమోదు చేశారు.