KMM: ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల నూతన చైర్మన్లు, కౌన్సిలర్లు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించిన మంత్రి, ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని మరియు పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు.