BDK: పినపాకలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు తక్షణం కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్కు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అనేక ఇళ్లు మంజూరై పూర్తి అయినప్పటికీ, చాలా ఇళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.