ఖమ్మం జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వన్యప్రాణులకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.