SRD: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో కందిలోని సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. వైద్యులు జైలులో ఉన్న ఖైదీలకు వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెండ్ సంతోష్ రాయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు పాల్గొన్నారు.