SRPT: మునగాల మండలం గణపవరం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు వేదికపై కూర్చోగా.. కోదాడ ఆర్డివో సూర్యనారాయణకు మాత్రం కుర్చీ లేక వారి వెనక నిలబడాల్సి వచ్చింది. నాయకుల తీరుపై రెవెన్యూ అధికారులు నిరసన వ్యక్తం చేశారు.