PDPL: సుల్తానాబాద్లో మంగళవారం 99మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా వంటి పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు.