JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఇవాళ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు. డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.