RR: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.