KRNL: హోళగుంద పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తికి అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయనను ప్రత్యేక అధికారిగా ఇవాళ నియమించారు. కలెక్టర్ ఆదేశాలతో పరిపాలనలో అంతరాయం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై పంచాయతీ పనులు ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.