BHPL: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ రాజ్ చేతుల్లో బందీ అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పేరిట రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాడని, డబ్బు ఇవ్వకపోతే పోస్టింగ్ ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచరణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.