MHBD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా ఊడుగుల ఐలయ్య యాదవ్ నియమితులయ్యారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ రాష్ట్ర కార్యాలయంలో వారికి సోమవారం నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని ఐలయ్య అన్నారు. నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.