కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సందర్శించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఆయన, కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.